గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో కరోనా విజృంభిస్తోంది. మంగళగవారం మంగళగిరిలో 7, మంగళగిరి మండలంలో 1, తాడేపల్లి మండలంలో రెండు కేసులు నమోదయ్యాయి. మంగళగిరిలో వచ్చిన 7 కేసుల్లో ఆరుగురు పోలీసులుండటం ఒక్క సారిగా కలవారనికి గురిచేసింది. ఇందులో మంగళగిరి ఆరో బెటాలియన్ లో పనిచేసే ఐదుగురు, డీజీపీ కార్యాలయంలో పనిచేసే ఓ కానిస్టేబుల్ కు వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు.
డీజీపీ ఆఫీస్లో పని చేసే కానిస్టేబుల్కు కరోనా... మంగళగిరిలో కలవరం...
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో కరోనా కలకలం రేపుతోంది. మంగళగిరిలో ఒక్కరోజే 7 కేసులు నమోదయ్యాయి. వారిలో ఆరుగురు పోలీసులుండటం కలవరపెడుతోంది.
మంగళగిరిలో కరోనా కలవరం
మంగళగిరి పోలీస్ స్టేషన్ లో పనిచేసే మహిళా కానిస్టేబుల్ భర్తకు కరోనా సోకడంతో అందులో పనిచేసే వారంతా మంగళవారం పరీక్షలు చేయించుకున్నారు. కొప్పురావూరు కాలనీలో మరో వ్యక్తికి సోకడంతో ఆ ప్రాంతంలో సుమారు వంద మందికి అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు
ఇదీ చదవండి: రూ.2.24లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన