ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రేషన్ బియ్యం పంపిణీ 25 శాతమే..!

By

Published : Feb 18, 2021, 12:00 PM IST

గుంటూరు జిల్లాలో బియ్యం కార్డుదారులకు ప్రతి నెలా ప్రభుత్వం ఇస్తున్న రాయితీ సరకులు నేటికీ లబ్ధిదారులు దగ్గరకు చేరలేదు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఎండీయూ వాహనాల ద్వారా పంపిణీ చేపట్టింది. ఆది నుంచి ఈ పంపిణీకి ఇబ్బందులు తప్పలేదు. ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. ఫలితంగా ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న రేషన్‌ సరకులు లబ్ధిదారులకు చేరేందుకు మరింత ఆలస్యమవుతోంది.

Beneficiaries taking rice
రేషన్ బియ్యం పంపిణీ 25 శాతమే..!

గుంటూరు జిల్లాలో బియ్యం కార్డుదారులకు ప్రతి నెలా ప్రభుత్వం అందించే రాయితీ సరకులు నేటికీ లబ్ధిదారుల చెంతకు చేరలేదు. గత నెలలో మాదిరిగా కాకుండా ప్రభుత్వం ఈ నెల నుంచి ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీ ప్రక్రియను ప్రారంభించింది. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఎండీయూ వాహనాల ద్వారా పంపిణీ చేపట్టింది. ఆది నుంచి ఈ పంపిణీకి ఇబ్బందులు తప్పలేదు. ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. ఫలితంగా ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న రేషన్‌ సరకులు లబ్ధిదారులకు చేరేందుకు మరింత ఆలస్యమవుతోంది.

●జిల్లాలో 14,64,126 బియ్యం కార్డులున్నాయి. గత నెలలో డీలర్ల ద్వారా పంపిణీ చేయగా 15వ తేదీ నాటికి 78.98 శాతం పూర్తయింది. ఈ నెలలో తొలుత పట్టణ ప్రాంతాల్లో ఎండీయూ(మొబైల్‌ డిస్పెన్సరీ యూనిట్‌) ద్వారా పంపిణీ చేపట్టారు. ఆది నుంచి సాంకేతిక సమస్యతో పంపిణీ వేగం పుంజుకోలేదు. డీలరు వద్ద నుంచి సరకులు తీసుకుంటే వాహనంలోకి చేర్చాల్సింది ఎవరనేది స్పష్టత రాలేదు. దీంతో కొన్ని రోజులు ఈ ప్రక్రియ నెమ్మదించింది. జిల్లాలోని 13 పట్టణ ప్రాంతాల్లో సుమారుగా 4 లక్షల బియ్యం కార్డులున్నాయి. కానీ ఈ నెల 14వ తేదీ వరకు 2,46,800 కార్డులకు మాత్రమే రేషన్‌ సరకులు అందాయి. 15వ తేదీ నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రారంభించగా.. ఇప్పటి వరకు 3,70,163 కార్డుదారులకు (25.28 శాతం) మాత్రమే సరకులు పంపిణీ చేశారు.

  • తూకం యంత్రంతోనే సమస్య

ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో రేషన్‌ సరకుల పంపిణీని ఎండీయూ వాహనాల ద్వారా చేపట్టారు. వాహనంలో అమర్చిన తూకానికి ఈపోస్‌ను అనుసంధానం చేస్తే సర్వర్‌ నిలిచిపోతుంది. దీంతో డీలరు వద్దనున్న తూకం యంత్రాలతో పలుచోట్ల పంపిణీ సాగుతోంది. తూకం యంత్రాలతో వస్తున్న సాంకేతిక సమస్యతో ఎండీయూ చోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు. వెళ్లిన చోట ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. గతంలో అయితే సర్వర్‌ సమస్య వస్తే రేషన్‌ దుకాణం వద్ద కనీసం నీడలో వేచి ఉండేవారు. ఇప్పుడు ఎండీయూ వాహనం వద్ద ఎండలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. డీలరు వద్ద సరకులను ఎండీయూ వాహనంలోకి తీసుకునే క్రమంలో డీలరు వద్ద సరకు ఉన్నప్పటికీ, ఈపోస్‌లో మాత్రం లేదని చూపిస్తుందని, ఈపోస్‌లో ఇన్‌స్పెక్షన్‌ రిపోర్టులో మాత్రం సరకు ఉన్నట్లుగా చూపిస్తుందని పలువురు డీలర్లు అంటున్నారు. అన్నీ సక్రమంగా ఉంటే సరకు వాహనంలోకి ఎక్కించడానికే సుమారు అరగంట పడుతుండగా.. డీలరు వద్ద ఈపోస్‌లో సరకు లేనట్లు చూపడంతో సర్వర్‌ కనెక్ట్‌ అయి సరయ్యేంత వరకు ఆగాల్సి రావడంతో మరింత జాప్యమవుతోంది.


ఇదీ చదవండి:

'ఫలితాలు తారుమారు చేశారు... చర్యలు తీసుకోండి'

ABOUT THE AUTHOR

...view details