ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CAPITAL FARMERS: 'రెండు సార్లు కలిసినప్పటికీ.. ఆ ఎమ్మెల్యే అబద్దం చెబుతున్నారు'

రాజధాని సమస్యలపై అమరావతి రైతులు తనను కలవలేదన్న తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలను ఐకాస నేతలు ఖండించారు. గతేడాది జనవరి 20న రాజధాని రైతులు గుంటూరులోని ఎమ్మెల్యే శ్రీదేవి కార్యాలయంలో కలిశామని పేర్కొన్నారు.

By

Published : Jul 4, 2021, 9:25 PM IST

మాట్లాడుతున్న ఐకాస నేతలు
మాట్లాడుతున్న ఐకాస నేతలు

రాజధాని సమస్యలపై అమరావతి రైతులు తనను కలవలేదన్న తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలను ఐకాస నేతలు ఖండించారు. గతేడాది జనవరి 20న రాజధాని రైతులు గుంటూరులోని శ్రీదేవి కార్యాలయంలో కలిశామని స్పష్టం చేశారు. రాజధానిగా ఈ ప్రాంతమే ఉండాలని, అంతా కలిసి పనిచేయాలని శ్రీదేవి సూచించారని రైతులు గుర్తుచేశారు.

తుళ్ళూరులో అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందామని చెప్పారని... ఆ తర్వాత కొన్నాళ్లకు ముఖం చాటేశారని రైతులు చెప్పారు. ఇప్పటికే రాజధాని సమస్యపై రెండుసార్లు మట్లాడామని కూడా రైతులు తెలిపారు. అయినప్పటికీ శాసనసభ్యురాలు అబద్దాలు చెబుతున్నారని.. ఇది తగదని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details