ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా శ్రీ సూర్యదేవర నరసయ్య పాఠశాల వజ్రోత్సవాలు

గుంటూరు జిల్లా చేబ్రోలులోని శ్రీ సూర్యదేవర నరసయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల వజ్రోత్సవ వేడుకలకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. పాఠశాలకు సంబంధించిన పైలాన్​ను ఆవిష్కరించటంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

By

Published : Dec 29, 2019, 4:33 PM IST

adhimulapu Suresh, who is Minister of Education, was present at the Diamond Jubilee celebrations of Sri Suryadevara Narasiah Government High School in guntur
శ్రీ సూర్యదేవర నరసయ్య పాఠశాల వజ్రోత్సవ వేడుకలను ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్​

శ్రీ సూర్యదేవర నరసయ్య పాఠశాల వజ్రోత్సవ వేడుకలను ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్​

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలులోని శ్రీ సూర్యదేవర నరసయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి సభ్యులు కేఎస్ లక్ష్మణరావు, స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట నరసయ్య, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 75 వసంతాలు పూర్తైన సందర్భంగా పైలాన్​ను ఆవిష్కరించారు. పాఠశాలకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. ఈ వేడుకలో పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details