ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రానికి 'అడెక్కో'

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. స్విట్జర్లాండ్​కు చెందిన అడెక్కో గ్రూపు కంపెనీ... ఏపీలో ఐటీ సర్వీసులు, హెచ్​ఆర్ సొల్యూషన్స్ అందించే కంపెనీ ఏర్పాటుకు అంగీకరించింది.

By

Published : Feb 27, 2019, 1:27 PM IST

Updated : Feb 28, 2019, 11:16 AM IST

అడెక్కో కంపెనీ ప్రతినిధులతో మంత్రి లోకేశ్ భేటీ

అడెక్కో కంపెనీ ప్రతినిధులతో మంత్రి లోకేశ్ భేటీ

ఆంధ్రప్రదేశ్​లో పెట్టుబడులు పెట్టేందుకు అడెక్కో గ్రూపు కంపెనీ ముందుకొచ్చింది. కంపెనీ ప్రతినిధులతో మంత్రి నారా లోకేశ్ ఈరోజు అమరావతిలో భేటీ అయ్యారు. స్విట్జర్లాండ్​కు చెందిన అడెక్కో... భారత్​లో పెద్దఎత్తున వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలో ఉంది. రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి తీసుకున్న చర్యలను మంత్రి వారికి వివరించారు. ఐటీ రంగానికి ఇచ్చిన పాలసీలు, రాయితీల గురించి తెలిపారు. ఐటీ సర్వీసులు, హెచ్​ఆర్ సొల్యూషన్స్ అందించే కంపెనీ ఏర్పాటుకు వారు అంగీకరించారు. రాష్ట్ర యువతకు అధునాతన సాంకేతికతలో నైపుణ్య శిక్షణకు సహకరించాలని మంత్రి కోరారు.

Last Updated : Feb 28, 2019, 11:16 AM IST

ABOUT THE AUTHOR

...view details