ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీఎంఆర్ఎఫ్​కు తలుపులమ్మలోవ దేవస్థానం విరాళం

By

Published : May 31, 2020, 9:31 PM IST

కరోనా నివారణార్ధం సీఎం సహాయనిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. వ్యక్తులు, సంస్థలు ఎవరికి తోచిన విధంగా వారు విరాళం అందజేస్తున్నారు. తాజాగా తలుపులమ్మలోవ ఉద్యోగులు రూ. 1,01,651 విరాళంగా ఇచ్చారు.

tuni talapulamma lova temple employees donation to cm relief fund
ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాకు చెక్కు అందజేస్తున్న తుని తలుపులమ్మ లోవ ఉద్యోగులు

కరోనా నివారణ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తలుపులమ్మలోవ దేవస్థానం ఉద్యోగులు రూ.1,01,651 విరాళాన్ని అందించారు. ఈవో చక్రధరరావు, ఛైర్మన్ ఉమారావులు, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాకు చెక్ అందించారు. విరాళమిచ్చిన వారిని రాజా అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details