రాజమహేంద్రవరం ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రత్యేకంగా అభిమానాన్ని చాటుకున్నారు. 13వ డివిజన్లోని తాడితోటలో పూలు, అరటి డొప్పలతో చంద్రబాబుకు గుడి కట్టారు. అందులో చిత్రపటాన్ని పెట్టి పూజించారు. పూలు విరజిమ్మారు. పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి కటౌట్ను శాలువాతో సత్కరించారు. పింఛన్లు పెంచి.. పసుపు కుంకుమ పథకం కింద డ్వాక్రా మహిళలకు 10 వేల రూపాయలను ప్రభుత్వం అందిస్తుండడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదే ప్రాంగణంలో తెర ఏర్పాటు చేసి.. ఎన్టీఆర్ నటించిన జస్టిస్ చౌదరి చిత్రాన్ని ప్రదర్శించారు.