అగ్నిప్రమాద బాధితులకు తెదేపా నాయకుల చేయూత
ఎర్రంశెట్టివారిపాలెం అగ్నిప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబాలకు... తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం తెదేపా నేతలు చేయూత అందించారు.
అగ్నిప్రమాద బాధితులకు తెదేపా నాయకుల చేయూత
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం ఎర్రంశెట్టివారిపాలెంలో అగ్నిప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు తెదేపా చేయూత అందించింది. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం తెదేపా ఇంఛార్జి గంటి హరిష్ మాథుర్ బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు 25కిలోలో బియ్యం, రూ.500నగదు ఇచ్చారు. బాధితులకు అండగా నిలుస్తామని హరిష్ మాథుర్ భరోసా ఇచ్చారు.