ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'జాతీయ కబడ్డీ పోటీలకు ప్రత్తిపాడు విద్యార్థిని'

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడుకు చెందిన విద్యార్థిని జాతీయ స్థాయి కబడ్డీ జట్టుకు ఎంపికైంది.

By

Published : Dec 23, 2019, 6:25 PM IST

Published : Dec 23, 2019, 6:25 PM IST

prathipadu student selected for national kabaddi sports
'జాతీయ కబడ్డీ పోటీలకు ప్రత్తిపాడు విద్యార్థిని'

'జాతీయ కబడ్డీ పోటీలకు ప్రత్తిపాడు విద్యార్థిని'
బాలికల సీనియర్ కబడ్డీ జట్టులో జాతీయ స్థాయి క్రీడలకు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు విద్యార్థిని ఎంపికైంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అరుణ జాతీయ స్థాయికి ఎంపికవ్వటం తమకు ఎంతో సంతోషంగా ఉందని పాఠశాల ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలో నిర్వహించిన గ్రిగ్ పోటీల్లో గెలుపొందిన ఆటగాళ్లను ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అభినందించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు అర్హత సాధించిన అరుణను ప్రత్యేకంగా అభినందించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయన్నారు ఎమ్మెల్యే. గెలుపు, ఓటములు సమానంగా స్వీకరించాలని సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details