తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాసర్లపూడిలో రహదారి నిర్మాణం చేపట్టాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. రహదారిని నిర్మిస్తామని ఆరు సంవత్సరాల క్రితం హామీ ఇచ్చారనీ.. ఆ మేరకు పనులు వేగవంతం చేయకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారి నిర్మాణాన్ని త్వరతిగతిన పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.
రహదారి కోసం పాసర్లపూడిలో స్ధానికుల ఆందోళన
తూర్పు గోదావరి జిల్లా పాసర్లపూడి వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. రహదారిని నిర్మిస్తామని హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా.. పనుల్లో మాత్రం వేగవంతం లేదని ఆరోపించారు.
రహదారి కోసం పాసర్లపూడిలో ఆందోళన