ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నన్నయ్య పీజీ' నోటిఫికేషన్ విడుదల

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని నన్నయ్య విశ్వవిద్యాలయ పీజీ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్​ను ఉపకులపతి ఆచార్య ఏవీ ప్రసాద్ విడుదల చేశారు.

By

Published : Feb 28, 2019, 9:16 PM IST

నన్నయ్య పీజీ ఎంట్రెన్స్ సెట్ విడుదల

నన్నయ్య పీజీ ఎంట్రెన్స్ సెట్ విడుదల
నన్నయ విశ్వవిద్యాలయ పీజీ కోర్సుల ప్రవేశ పరీక్ష - 2019 కు నోటిఫికేషన్ విడుదలైంది.నేటి నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు .www.aknudoa.in (or) www.aknu.edu.in (or) www.nannayacet.in వెబ్​సైట్లద్వారా దరఖాస్తు చేసుకోవచ్చుని ఇంచార్జ్ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య ఏవి ప్రసాద్ రావు తెలిపారు.ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని పీజీ కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా నన్నయ సెట్- 2019లో అర్హత సాధించాలని చెప్పారు.దరఖాస్తు రుసుము రూ. 500,ఎస్టీ/ ఎస్సీ/ పి హెచ్ అభ్యర్థులకు రూ.300 గా నిర్ణయించారు.అపరాధ రుసుము రూ.500తోఏప్రిల్ 25 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ 27వ తేదీ నుండి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్​లోడ్ చేసుకోవచ్చని.. మే 7 నుంచి 9వ తేదీ వరకు ప్రవేశపరీక్షలు నిర్వహిస్తామనితెలిపారు.

ABOUT THE AUTHOR

...view details