ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 9, 2021, 3:32 PM IST

ETV Bharat / state

రాజమహేంద్రవరంలో పలువురు ముస్లింలు తెదేపాలో చేరిక

వైకాపా పాలనలో మైనారిటీలపై దాడులు పెరిగాయని.. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 150మంది ముస్లింలు తెదేపాలో చేరారు.

minorities joins in tdp at rajamahendravaram in east godavari
ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఆధ్వర్యంలో తెదేపాలో చేరిన మైనారిటీలు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పలువురు ముస్లింలు తెదేపాలో చేరారు. ఆజాద్ చౌక్​లో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఆధ్వర్యంలో 150మంది మైనారిటీలు తెదేపాలో చేరారు.

తెదేపా హయాంలో మైనాటీల సంక్షేమానికి పలు పథకాలు అమలు చేశారని.. ఎమ్మెల్యే భవానీ అన్నారు. వైకాపా పాలనలో మైనారిటీలపై దాడులు పెరిగాయని.. వాటిని నియంత్రించాలన్నారు. కొత్తగా పార్టీలోకి చేరిన వారందరికీ ఎమ్మెల్యే కండువాలు కప్పి ఆహ్వానించారు.

ABOUT THE AUTHOR

...view details