పాలకులం కాదు సేవకులమని చెప్పిన సీఎం జగన్.. సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజకీయాలంటే జీవితాలు బాగుచేసేదని ప్రజలకు నమ్మకం కలిగించారని కొనియాడారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఇంటింటికీ బియ్యం పంపిణీ కోసం వాహనాలను ప్రారంభించారు. రేషన్ సరకులు అందించడానికి 1,076 వాహనాలు ప్రారంభించడం చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు.
గతంలో ఎవరూ చేయని గొప్ప కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని కలెక్టర్ మురళీధర్రెడ్డి తెలిపారు. ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జేసీ లక్షీశలతో పాటు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.