ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశువుల పెంపకమంటే తనకెంతో ఇష్టం

సినీనటుడు జగపతిబాబు తూర్పుగోదావరి జిల్లా గుమ్మిలేరుకు వచ్చారు. మేలు జాతి పశువుల పెంపకాన్ని పరిశీలించారు.

By

Published : May 31, 2019, 7:34 AM IST

జగపతిబాబు

తూర్పుగోదావరిజిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరులో రైతులు పెంచుతున్న మేలు జాతి పశువులను సినీనటుడు జగపతిబాబు సందర్శించారు. రాజమహేంద్రవరంలోని బంధువుల ఇంట్లో శుభకార్యం నిమిత్తం వచ్చిన జగపతిబాబు గుమ్మిలేరు వచ్చారు. గ్రామంలో ఉన్న పశువుల కొట్టాలు, పశువీర్య ఉత్పత్తిని పరిశీలించారు. మేలు జాతి ముర్రా దున్నలు, ఒంగోలు, పుంగనూరు, జాతి పశువులను చూసి ఆనందం వ్యక్తం చేశారు. తనకు మేలు జాతి పశువులు అంటే ఎంతో ఇష్టమని కపిల ఆవు, పుంగనూరు ఆవులను పెంచాలనే తపన ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details