ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 8, 2019, 1:56 PM IST

ETV Bharat / state

వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తజనం

తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. రాష్ట్రం నలుమూలలనుంచి భక్తులు తరలిరావటంతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది.

వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తజనం

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.నోము నోచుకునే భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం మెుత్తం గోవింద నామస్మరణతో మారుమోగింది.భక్తులతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. ఆలయానికి వచ్చిన భక్తులకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.

వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తజనం

ABOUT THE AUTHOR

...view details