ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పుష్ప' కోసం.. మారేడిమిల్లి చేరుకున్న హీరో అల్లు అర్జున్

'పుష్ప' సినిమా చిత్రీకరణలో భాగంగా హీరో అల్లు అర్జున్ తూర్పుగోదావరి జిల్లా మారేడిమిల్లి చేరుకున్నారు. రేపటి నుంచి షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

By

Published : Nov 9, 2020, 11:27 AM IST

Hero Allu Arjun reached Maredimilli
మారేడిమిల్లి చేరుకున్న హీరో అల్లు అర్జున్

హీరో అల్లు అర్జున్ తూర్పుగోదావరి జిల్లా మారేడిమిల్లిని చేరుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో తీస్తున్న 'పుష్ప' సినిమా చిత్రీకరణ నిమిత్తం ఆదివారం రాత్రి ఆ ప్రాంతానికి వెళ్లారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా షూటింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈనెల 10 నుంచి షూటింగ్ మొదలు పెట్టనున్నారు. చిత్రీకరణకు డమ్మీ ఎర్ర చందనం దుంగలు, రాళ్లను సిద్ధం చేశారు. మాడుగులలో హెచ్​ఎంటీసీ ఫారం వద్ద నిర్మించిన వుడ్స్ కాటేజిల్లో చిత్ర బృందం బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే హీరో అల్లు అర్జున్ ఉండేందుకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details