శంఖవరంలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు 2020 ముసాయిదాకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా శంఖవరం విద్యుత్ ఉద్యోగులు నిరసన చేపట్టారు.
శంఖవరంలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు 2020 ముసాయిదాకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు జేఏసీ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా శంఖవరం విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తంచేశారు. ప్రొటెస్ట్ డే సందర్భంగా నిరసన చేపట్టినట్లు ఉద్యోగులు తెలిపారు.