ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 9, 2020, 12:49 PM IST

ETV Bharat / state

చనిపోయిన వ్యక్తికి కరోనా పాజిటివ్​

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం పీ.ఈ. చిన్నయ్యపాలెంలో చనిపోయిన వ్యక్తికి కరోనా పాజిటివ్​ నిర్దరణ అయ్యింది. ఈ నెల 5న మధుమేహంతో గుంటూరు ఆసుపత్రిలో చేరిన వ్యక్తి మృతి చెందాడు. అనంతరం నమూనాలు సేకరించి పరీక్షించగా కరోనా అని తెలింది.

corona case in east godavari
తూర్పు గోదావరిలో కరోనా మృతుడు

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం పీ.ఈ. చిన్నయ్యపాలెంలో కరోనా కలకలం రేపింది. గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందగా అంత్యక్రియల అనంతరం కరోనా పాజిటివ్ అని నిర్ధరణ కావడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది.

గ్రామానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి ఈ నెల 5న మధుమేహంతో అనారోగ్యానికి గురై గుంటూరు ఆసుపత్రిలో మృతి చెందాడు. మృతదేహం నుంచి నమూనాలు సేకరించి కోవిడ్ పరీక్షలకు అధికారులు పంపించారు. అయితే ఈ ఫలితం రాకుండానే మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి.. అంత్యక్రియలు నిర్వహించారు.

అంత్యక్రియల అనంతరం కరోనా పాజిటివ్ ఉన్నట్లు రిపోర్ట్ వచ్చింది. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు అప్రమత్తమై మృతుని కుటుంబ సభ్యులు, అంత్యక్రియల్లో పాల్గొన్న వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి: సుప్రీంలో ఎల్జీ పాలిమర్స్​ కేసు: విచారణ వాయిదా

ABOUT THE AUTHOR

...view details