ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శిరోముండనం వ్యవహారం: వరప్రసాద్​కు చంద్రబాబు రూ.2లక్షల సాయం

శిరోముండనం వ్యవహారంలో ఎస్సీ యువకుడు వరప్రసాద్​కు తెదేపా అధినేత చంద్రబాబు రూ.2లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. దళితుల పట్ల వైకాపా నాయకులు, అధికార పార్టీ నేతలు దుర్మార్గాలను ఆపకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామన్నారు.

By

Published : Jul 28, 2020, 1:20 PM IST

chandra babu gave 2 lakhs to sc man varaprasad
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు

ఎస్సీ యువకుడు వరప్రసాద్​కు తెదేపా అధినేత చంద్రబాబు రూ.2లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. పోలీసుల సమక్షంలో ఆ యువకుడికి శిరోముండనం చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పట్ల వైకాపా నాయకులు, అధికార పార్టీ నేతలు దుర్మార్గాలను ఆపకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి... వారిని అణచివేసేలా వ్యవహరించడం సరికాదన్నారు.

ABOUT THE AUTHOR

...view details