ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతులకు 100కోట్ల వ్యవసాయ రుణాలు పంపిణీ చేశాం!'

రైతులకు 100కోట్ల వ్యవసాయ రుణాలు పంపిణీ చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎస్​బీఐ రీజనల్ మేనేజర్​ వేమూరి నరసింహ మూర్తి ప్రకటించారు. అమలాపురం రీజియన్ పరిధిలో ఆర్థిక సంవత్సరానికి రూ. 100కోట్ల రుణాలు పంపిణీ చేయటం గొప్పవిషయం అని తెలిపారు. పి.గన్నవరం ఎస్​బీఐలో ఖాతాదారులతో ఆయన సమావేశం నిర్వహించారు.

By

Published : Mar 17, 2020, 1:29 PM IST

Updated : Mar 17, 2020, 4:23 PM IST

100 croes loans are distrubuted in east godavari dst amalapuram sbi regional
సమావేశంలో మాట్లాడుతున్న అమలాపురం ఎస్​బీఐ రీజనల్​ మేనేజర్

సమావేశంలో మాట్లాడుతున్న అమలాపురం ఎస్​బీఐ రీజనల్​ మేనేజర్

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రీజియన్ పరిధిలో రైతులకు రూ 100 కోట్లు వ్యవసాయ రుణాల పంపిణీ చేశామని ఎస్​బీఐ అమలాపురం రీజనల్ మేనేజర్ వేమూరి నరసింహమూర్తి వెల్లడించారు. పి.గన్నవరం ఎస్​బీఐ బ్రాంచ్​లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎస్​బీఐ లైఫ్ రుణ రక్ష పాలసీపై ఆయన అవగాహన కల్పించారు. రుణ రక్ష పాలసీ కింద లబ్ధి పొందిన వారికి వివిధ మొత్తాలను డీడీల రూపంలో అందించారు. రీజియన్ పరిధిలో వ్యక్తిగత రుణాలు రూ. 47 కోట్లు, గృహ రుణాలు రూ 126 కోట్లు అందించామని రీజనల్ మేనేజర్ నరసింహ మూర్తి తెలిపారు. బ్రాంచ్ మేనేజర్ మృత్యుంజయరావు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

Last Updated : Mar 17, 2020, 4:23 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details