తితిదే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనం వద్ద చేపట్టిన నిరసన దీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. తితిదే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు ఎం.నాగార్జున మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఏపీసీఓఎస్లో కలిపేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోందని, దీనివల్ల కలిగే లాభం ఏంటని ప్రశ్నించారు. కరోనా విపత్తు సమయంలో మూడు నెలలుగా సిబ్బంది పలు రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవటం దారుణమన్నారు.
ఏపీసీఓఎస్లో విలీనం వల్ల తితిదేకి సెస్ రూపంలో సంవత్సరానికి సుమారు మూడు కోట్ల రూపాయలు నష్టం కలుగుతున్నా.. అధికారులు పట్టించుకోకుండా ఈ నిర్ణయానికి వత్తాసు పలకడం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన టైమ్ స్కేలు హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.