ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేసవి సెలవులతో.. తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ

వేసవి సెలవులు, వారాంతాన్ని పురస్కరించుకుని తిరుమలకు భక్తులు పోటెత్తారు. స్వామివారి సాధారణ దర్శనానికి 26 గంటల సమయం పడుతోంది.

By

Published : Apr 20, 2019, 3:46 PM IST

వేసవి సెలవులతో.. తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వేసవి సెలవులు, వారాంతం అయినందువల్ల పెద్దఎత్తున భక్తజనం తిరుమల కొండకు చేరుకుంటున్నారు. తరలివస్తున్న భక్తులతో వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. వైకుంఠం వెలుపల లేపాక్షి వలయం వరకు 2 కిలోమీటర్లకుపైగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 26 గంటలు.. టైమ్​స్లాట్ టోకెన్లు పొందినవారికి 5 గంటలకు పైగా సమయం పడుతోంది.

ABOUT THE AUTHOR

...view details