ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చంద్రబాబు సొంత పంచాయతీలో తెదేపా మద్దతుదారు విజయం

By

Published : Feb 22, 2021, 6:31 AM IST

తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు సొంత పంచాయతీ అయిన చిత్తూరు జిల్లా కందులవారిపల్లె సర్పంచ్ ఎన్నికల్లో తెదేపా బలపరచిన అభ్యర్థి గెలుపొందారు. కార్యకర్తలు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు.

tdp-supporter-wins-in-chandrababus-own-panchayat-kandulavaripalle-in-chittoor-district
చంద్రబాబు సొంత పంచాయతీలో తెదేపా మద్దతుదారు విజయం

తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె ఉన్న.. చిత్తూరు జిల్లా కందులవారిపల్లె పంచాయతీలో... తెదేపా మద్దతుదారు సర్పంచుగా విజయం సాధించారు. పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కందులవారిపల్లె గ్రామ పంచాయతీలోని 12 వార్డుల్లో రెండు ఏకగ్రీవమయ్యాయి.

పది వార్డులు, సర్పంచు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. అన్ని వార్డు స్థానాల్లో తెదేపా బలపరచిన అభ్యర్థులు గెలుపొందారు. సర్పంచ్​గా పోటీ చేసిన బొబ్బాలక్ష్మి 566 ఓట్ల తేడాతో విజయం సాధించారు. చంద్రగిరి నియోజకవర్గ పార్టీ ఇంఛార్జీ పులివర్తి నాని.. నారావారిపల్లెకు చేరుకొని తెదేపా శ్రేణులను అభినందించారు. ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.

ABOUT THE AUTHOR

...view details