ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్రా -  కర్నాటక సరిహద్దులో భద్రత కట్టుదిట్టం

రెండవ దశ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం మేరకు అధికారులు ఆంధ్రా - కర్నాటక సరిహద్దు వద్ద పోలీసులను మోహరించారు. రాష్ట్రంలోకి వచ్చే ప్రతీ వాహనాన్ని క్షణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

By

Published : Feb 13, 2021, 4:30 PM IST

Security has been beefed up along the Andhra-Karnataka border for the election
ఆంధ్రా- కర్నాటక సరిహద్దులో భద్రత కట్టుదిట్టం

రాష్ట్రంలో పంచాయతీ రెండవ దశ ఎన్నికల సందర్భంగా ఆంధ్రా - కర్నాటక సరిహద్దు వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలంలోని చీకల బైలు చెక్ పోస్ట్ వద్ద కర్నాటక నుంచి వచ్చే వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు కర్నాటక నుంచి కొందరు అక్రమ మార్గాల్లో మద్యం, డబ్బు పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతను పెంచామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:బాధ్యత మరువని 102 ఏళ్ల వృద్ధురాలు

ABOUT THE AUTHOR

...view details