ఆంధ్రప్రదేశ్ను అవినీతిరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే అందరకి కృషి పట్టుదల కావాలని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. పుత్తూరలోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడిన ఆయన... జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కులమతాలకతీతంగా సంక్షేమ పథకాలు అందితున్నట్టు పేర్కొన్నారు. గోదావరి జలాలను తరలించి రాయలసీమ జిల్లాలను రతనాలసీమగా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు.
అందరి కృషితోనే... అవినీతిరహిత ఆంధ్రప్రదేశ్
ప్రతి ఒక్కరి కృషితోనే మద్యపానాన్ని నిషేధించగలుగుతాం... అందరూ ఈ మహాయజ్ఞానికి తోడ్పడాలని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో ఉపముఖ్యమంత్రి తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
సమావేశంలో మాట్లాడుతున్నఉపముఖ్యమంత్రి