ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన కారు.. అందులోచూస్తే..!

ఓ కారు అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసికెళ్లిన ఘటన చిత్తూరు గాజులపల్లెలో జరిగింది. కారులో చూడగా... అందులో ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి.

By

Published : Nov 23, 2019, 1:00 PM IST

Published : Nov 23, 2019, 1:00 PM IST

కారులో ఎర్రచందనం దుంగ

అదుపుతప్పిన కారు..అందులో ఎర్రచందనం దుంగలు

చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం పరిధిలోని గాజులపల్లెలో టీఎన్ 07ap2190 నెంబర్ గల కారు అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. ఎవరికైనా గాయాలయ్యాయా అని స్థానికులు దగ్గరికి వెళ్లగానే డ్రైవర్ కారును వదిలి పరారయ్యాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తవనంపల్లి పోలీసులు కారును పరిశీలించగా.. అందులో ఆరు ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. కారు, దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details