ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్మశాన వాటికకు దారి లేదని.. దళితుల ఆందోళన

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం బుచ్చినాయుడుపల్లిలో దళితులు ఆందోళన బాట చేపట్టారు. గ్రామంలో శ్మశాన వాటికకు దారి లేదని.. అధికారులు స్పందించాలని కోరారు.

By

Published : Feb 7, 2022, 4:17 PM IST

people protest for not having no way to cemetry in buchinaidupally at chittor
శ్మశాన వాటికకు దారి లేదని దళితుల ఆందోళన

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం బుచ్చినాయుడుపల్లిలో దళితులు ఆందోళన బాట పట్టారు. తాజాగా.. అనారోగ్యంతో ఎస్సీ కాలనీకి చెందిన మునిస్వామి అనే వృద్ధుడు మృతి చెందాడు. అయితే.. సదరు మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించేందుకు తీసుకెళ్లడానికి.. శ్మశాన వాటికకు దారిలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

శ్మశాన వాటికకు వెళ్లే దారిని కొందరు గ్రామస్తులు ఆక్రమించారని.. ఫెన్సింగ్ వేసి దారి లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇదేవిధంగా ఇబ్బంది పెట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు స్పందించి, తమ సమస్యకు పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details