ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రామిక్​ రైల్లో జార్ఖండ్ బయల్దేరిన వలస కార్మికులు

జార్ఖండ్ రాాష్ట్రానికి చెందిన వలస కార్మికులను చిత్తూరు జిల్లా అధికారులు వారి స్వస్థలాలకు పంపించడానికి చర్యలు చేపట్టారు. వారిని శ్రామిక్ రైలులో సొంత రాష్ట్రానికి అధికారులు పంపించారు.

By

Published : May 22, 2020, 11:58 PM IST

Officials  sent migrant workers to Jharkhand on a train
రైలు ఎక్కడానికి వెళ్తున్న కార్మికులు

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన 771 మంది జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆయా మండలాల తహసీల్దార్లు గుర్తించారు. వారిని చిత్తూరుకు తరలించి.. వసతి సదుపాయాలు కల్పించారు. శుక్రవారం రాత్రి వీరిని ప్రత్యేక శ్రామిక రైలులో జార్ఖండ్ కు పంపించారు. కరతాళ ధ్వనులతో వలస కార్మికులకు అధికారులు వీడ్కోలు పలికారు.

ఇదీ చదవండి:ద్విచక్రవాహనం ఢీకొని బాలుడి మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details