ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రగిరిలో బాలికల వసతి గృహం పునః ప్రారంభం

చిత్తూరు జిల్లా చంద్రగిరి  ప్రభుత్వ బాలికల కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో గతంలో ఉన్న వసతి సముదాయాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి  తిరిగి ప్రారంభించారు.

By

Published : Aug 7, 2019, 5:42 PM IST

బాలికల వసతి గృహాన్ని పునః ప్రారంభించిన ఎమ్మెల్యే

బాలికల వసతి గృహాన్ని పునః ప్రారంభించిన ఎమ్మెల్యే

చిత్తూరు జిల్లా చంద్రగిరి ప్రభుత్వ బాలికల కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో గతంలో ఉన్న వసతి సముదాయాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరిగి ప్రారంభించారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. వసతి గృహాలలో ఉన్న విద్యార్థినులకు ఎటువంటి అసౌకర్యం కలిగించరాదని.. అన్ని రకాల సౌకర్యాలు అందించి విద్యను బోధించాలని అధికారులను కోరారు. చదువుకోలేని విద్యార్థినులకు చదువుపై ఆసక్తి పెంచే విధంగా విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ అధికారులందరూ అంకిత భావంతో పని చేయాలని అధికారులను కోరారు.

ABOUT THE AUTHOR

...view details