ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మదనపల్లె తండాల్లో కేరళ ఐజీ లక్ష్మణ్ నాయక్ పర్యటన

చిత్తూరు జిల్లా మదనపల్లెలో కేరళ ఐజీ గుగులోతు లక్ష్మణ్ నాయక్ పర్యటించారు. తెలుగువారైన ఆయన.. నారామాకుల, దాది నాయిని తండాల్లో పర్యటించి.. అక్కడి ప్రజల జీవన విధానం, స్థితిగతులను పరిశీలించారు.

By

Published : Dec 24, 2020, 7:29 AM IST

Kerala IG Gugulothu Laxman Nayak
మదనపల్లెలో కేరళ ఐజీ గుగులోతు లక్ష్మణ్ నాయక్

కేరళ ఐజీ గుగులోతు లక్ష్మణ్ నాయక్ చిత్తూరు జిల్లా మదనపల్లెలో పర్యటించారు. ఆయనకు జిల్లా గిరిజన సంరక్షణ సేవా సమితి నాయకులు ఘన స్వాగతం పలికారు. తెలుగువారైన ఆయన.. మదనపల్లె మండలంలోని నారామాకుల, దాది నాయిని తండాలకు వెళ్లారు.

అక్కడి లంబాడీల జీవన విధానం, స్థితిగతులను స్వయంగా పరిశీలించారు. బంజారా భాషలోనే స్థానిక ప్రజలను పలకరించిన కేరళ ఐజీ.. సమాజ అభ్యున్నతి కోసం అవలంబించాల్సిన విధానాలను వారికి తెలియజెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details