ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పొలాల్లో ఆరబోసిన వంద బస్తాల వేరుశనగ చోరీ

By

Published : Jul 29, 2020, 8:30 AM IST

కల్లంలో ఆరబోసిన వేరు శెనగ కాయలను చోరీ చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లడంతో ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

huge groundnuts theft in erpedu chitthore district
పొలాల్లో ఆరబోసిన వంద బస్తాల వేరుశనగ చోరీ

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలంలో పొలాల్లో ఆరబోసిన వేరుశనగ కాయలు చోరీకి గురయ్యాయి. రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు... వంద వేరుశనగ బస్తాలను అపహరించారు. ఫలితంగా తాము ఆరుగాలం శ్రమించి పండించిన పంట దొంగలపాలయ్యిందని రైతులు తీవ్ర వేదన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details