చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో రాత్రి భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.రంగంపేట పంచాయతీ సాయి నగర్ కాలనీలో ఇళ్లు నీటమునిగాయి.ఇంట్లో ఉన్న బియ్యం,పప్పు ఇతర నిత్యావసర వస్తువులు వరద నీటిలో మునిగిపోవడంతో బాధితులు లబోదిపబోమంటున్నారు.అధికారులు స్పందించి తమను తక్షణమే ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
చంద్రగిరిలో భారీ వర్షానికి నీట మునిగిన కాలనీలు
చిత్తూరు జిల్లాలో కురిసిన భారీ వర్షంతో చంద్రగిరిలోని పలు కాలనీలు నీటమునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం