ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'వారు మాకు న్యాయం చేయలేదు.. మీరైనా చేయండి'

చిత్తూరు జిల్లా చంద్రగిరి పోలీస్టేషన్ లో తమకు న్యాయం జరగలేదంటూ తిరుపతి అర్బన్ ఎస్పీకి తొండవాడ గ్రామస్థులు ఫిర్యాదు చేశారు.

By

Published : May 18, 2020, 7:37 PM IST

Published : May 18, 2020, 7:37 PM IST

Complaint to Tirupati Urban SP on Chandragiri police
చంద్రగిరి పోలీసులపై తిరుపతి అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తొండవాడలో గ్రామస్థుల మధ్య ఘర్షణ జరిగింది. కులం పేరుతో తమను దూషిస్తూ, దాడులకు పాల్పడుతూ ఓ వర్గం ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కొందరు గ్రామస్థులు ఆందోళన చెందారు. చంద్రగిరి పోలీస్ స్టేషన్లో భాదితులు ఫిర్యాదు ఇచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయారు.

మరోవర్గం నుంచి ఒత్తిడి ఎక్కువ అయిన కారణంగా... తప్పనిసరి పరిస్థితుల్లో తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details