ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'స్వర్ణిమ్ విజయ్ వర్ష్' వేడుకల కోసం తిరుపతి చేరుకున్న సీఎం జగన్

By

Published : Feb 18, 2021, 6:02 PM IST

1971 యుద్ధంలో పాకిస్థాన్​పై భారత్ విజయం సాధించి 50 ఏళ్లు పూర్తి కాగా.. తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో 'స్వర్ణిమ్ విజయ్ వర్ష్' వేడుకలు నిర్వహిస్తున్నారు. వీటిలో పాల్గొనేందుకు సీఎం జగన్ ఇప్పటికే రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఈ కార్యక్రమానికి హాజరవుతారు.

ministers welcomed cm jagan in renigunta airport
రేణిగుండ విమానాశ్రయంలో సీఎం జగన్​కు స్వాగతం పలికిన మంత్రులు

తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో 'స్వర్ణిమ్ విజయ్ వర్ష్' వేడుకల్లో పాల్గొనేందుకు.. సీఎం జగన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి ఆయనకు స్వాగతం పలికారు.

1971 యుద్ధంలో పాకిస్థాన్​పై భారత్ ఘన విజయం సాధించి 50 ఏళ్లు పూర్తి కాగా.. తిరుపతిలో స్వర్ణోత్సవాలు జరుపుతున్నారు. రాష్ట్రానికి సంబంధించి నాటి యుద్ధవీరుల పోరాటాన్ని స్మరించుకునేందుకు వీటిని నిర్వహిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details