ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భాజపాలో మా ఎంపీల విలీనం అనైతికం: తెదేపా

తెదేపా ఎంపీలు భాజపాలోకి వెళ్లడాన్ని ఆపార్టీ సీనియర్ నేతలు తప్పుపట్టారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూలు ప్రకారం ఒక పార్టీని మరో పార్టీలోకి విలీనం చేయటం కుదరదన్నారు.

By

Published : Jun 24, 2019, 8:54 PM IST

ఎంపీల విలీనం అనైతికం

ఎంపీల విలీనం అనైతికం

తమ పార్టీని భాజపాలో విలీనం చేసే అధికారం.. కమలం గూటికి చేరిన ఎంపీలతో పాటు మరెవరికీ లేదని తెలుగుదేశం పార్టీ సీనీయర్ నేతలు వర్లరామయ్య, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూలు ప్రకారం ఈ చర్య కుదరదని వ్యాఖ్యానించారు. అలాంటప్పడు ఉపరాష్ట్రపతి వెంకయ్య వారి విలీన లేఖను ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. వారి స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీ మారారని.... ఒక్క క్షణం కూడా వారు ఎంపీలుగా కొనసాగడానికి వీల్లేదని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details