ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమ్మ ఒడి...ప్రైవేటు విద్యాసంస్థలకూ వర్తింపజేయాలి!

అమ్మ ఒడి పథకాన్ని ప్రైవేటు విద్యాసంస్థలకూ వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్, మేనేజ్​మెంట్స్ అసోసియేషన్ సీఎం జగన్​కు విజ్ఞప్తి చేసింది. సచివాలయానికి వచ్చిన ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.కృష్ణా రెడ్డి సహా ప్రతినిధుల బృందం  లేఖను ముఖ్య సలహాదారు  అజేయ కల్లానికి అందించారు.

By

Published : Jun 22, 2019, 7:05 AM IST

PRIVATE SCHOOL OWNERS DEMANDS AMMA VODI SCHEEME APPLY TO PRIVATE INSTITUTIONS

ప్రభుత్వ బడులను బలోపేతం చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపిన సంఘం నేతలు... ప్రైవేటు బడులనూ కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉందని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కుటుంబాలకే అమ్మఒడి పథకం కింద 15 వేల రూపాయలు అందిస్తే...ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా ప్రభుత్వ బడులకు తరలి వెళ్తారని వారు అభిప్రాయపడ్డారు. లాభాపేక్ష లేకుండా విద్యనందిస్తోన్న అనేక ప్రైవేటు పాఠశాలలు మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని లేఖలో తెలిపారు.

అమ్మ ఒడి...ప్రైవేటు విద్యాసంస్థలకూ వర్తింపజేయాలి!
చాలా మంది ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు రోడ్డున పడతారని సీఎం దృష్టికి తెచ్చారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతూ...రేషన్ కార్డు ఉన్న పేద విద్యార్థుల కుటుంబాలకూ పథకాన్ని వర్తింపజేయాలని కోరారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సహా పలువురు మంత్రులను కలసి తమ వినతి పత్రాన్ని అందించారు.

ABOUT THE AUTHOR

...view details