ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా గూటికి చలమలశెట్టి

తూర్పుగోదావరి జిల్లా నాయకుడు చలమలశెట్టి సునీల్.. అనుచరులతో కలిసి తెదేపా గూటికి చేరారు. అధినేత చంద్రబాబు... కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తి  సునీల్ అని ప్రశంసించారు.

By

Published : Mar 1, 2019, 6:22 PM IST

Updated : Mar 1, 2019, 7:15 PM IST

సీఎం

తెదేపా గూటికి చలమశెట్టి
తూర్పుగోదావరి జిల్లా నాయకుడు చలమలశెట్టి సునీల్.. అనుచరులతో కలిసి తెదేపా గూటికి చేరారు. అధినేత చంద్రబాబు... కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చంద్రబాబు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాలూ గెలుస్తామని స్పష్టం చేశారు. ఏపీకి న్యాయం చేస్తారని పొత్తు పెట్టుకుంటే.. భాజపా నేతలు నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. ఆదాయ మార్గాలన్నీ తగ్గించి విశాఖకు రైల్వే జోన్ ఇచ్చారని ఆరోపించారు.ప్రధాని మోదీ వస్తున్న ఈ రోజు... రాష్ట్రానికి చీకటిరోజుని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ ఎప్పుడైనా విశాఖ రైల్వే జోన్ గురించి కేంద్రాన్ని ప్రశ్నించారా.. అని నిలదీశారు. కేసుల మాఫీ కోసమే భాజపాతో వైకాపా లాలూచీ రాజకీయం చేస్తోందన్నారు. కేసీఆర్‌తో కలిసి రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఊపిరి ఉన్నంతవరకు జగన్‌, కేసీఆర్‌ కుట్రలు సాగనివ్వనని తేల్చి చెప్పారు. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తి చలమలశెట్టి సునీల్ అని ప్రశంసించారు.
Last Updated : Mar 1, 2019, 7:15 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details