ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధర్మపోరాటం ముగిసింది.. దేశం ఒక్కటైంది!

విభజన హామీలు విస్మరించి.. కేంద్రం వేధిస్తోందంటూ.... ఆ విషయాన్ని జాతీయస్థాయిలో ఎండగట్టేందుకు... సీఎం చంద్రబాబు చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్ష ముగిసింది.

By

Published : Feb 11, 2019, 8:47 PM IST

Updated : Feb 11, 2019, 11:06 PM IST

చంద్రబాబుకు నిమ్మరసం తాగిపిస్తున్న దేవేగౌడ

ఉదయం 8. గంటలకు మహాత్ముడికి ఘననివాళి అర్పించిన చంద్రబాబు... అక్కడ్నుంచి నేరుగా దిల్లీలోని ఏపీ భవన్‌కు చేరుకున్నారు. అక్కడున్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి.. దీక్షకు కూర్చున్నారు. కేంద్రం తీరుతో రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని.. కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్న చూపుతున్న నిర్లక్ష్యాన్ని జాతీయ స్థాయిలో చాటారు. దేశంలోని ఎన్డీఏతర ప్రధాన రాజకీయ పక్షాలన్నీ చంద్రబాబకు మద్దతు పలికాయి. పలువురు జాతీయ నేతలు స్వయంగా దీక్షాస్థలికి వచ్చిన ఆయనకు సంఘీభావం తెలిపారు. కేంద్రం అన్యాయం చేస్తున్నా.. దేశం మొత్తం రాష్ట్రానికి అండగా... నిలించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దీక్ష చేయడానికి కారణాలు వివరించిన ఆయన .. గుంటూరు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు.

ముగిసిన ధర్మపోరాటం


చంద్రబాబు చేపట్టిన దీక్షకు భారీ సంఖ్యలో మద్దతు లభించింది. జాతీయ స్థాయి నేతలంతా దీక్షా స్థలికి చేరుకొని... సంఘీభావం తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను..విస్మరించి.. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ వంటి నేతలంతా...ప్రధాని నరేంద్ర మోదీపై ధ్వజమెత్తారు. ఫరూక్‌ అబ్దుల్లా, శరద్‌ యాదవ్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్, అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం గెగాంగ్ అపాంగ్, కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మ, ఆజాద్‌, శరద్‌ పవార్‌, జైరాం రమేష్‌ దీక్షా వేదిక వద్దకు వచ్చి మద్దతు పలికారు. పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఫోనులో మాట్లాడి సంఘీభావం తెలిపారు. జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ట్విట్టర్‌ ద్వారా దన్నుగా నిలిచారు.

ఎవరేమన్నారంటే....

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఇచ్చిన మాటను ఈ ప్రధాని పెడచెవిన పెట్టారు. దేశ ప్రధానిగా ఒక మాట చెప్పారంటే తు.చ. తప్పకుండా అమలు చేయాలి. ఏపీ ఈ దేశంలో భాగంకాదా... ప్రధాని ఎక్కడికెళ్తే అక్కడి పాట పాడతారు. ఏపీకి వెళ్తే హోదా ఇవ్వకుండానే అబద్ధాలు చెబుతారు. మోదీకి విశ్వసనీయత లేదు... ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే. ఏపీ ప్రజల సొమ్ము దోచి అంబానీకి కట్టబెట్టారు.
-రాహుల్‌గాంధీ

భారత ప్రభుత్వం ఏపీకి పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా హామీ పార్లమెంటు సాక్షిగా ఇచ్చిందే. విభజన హామీలకు అప్పుడు అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి. ప్రత్యేక హోదా సాధన కోసం చంద్రబాబు చేస్తున్న పోరాటానికి అందరం సహకరిస్తాం.
-మన్మోహన్‌సింగ్‌

రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రూ.వేల కోట్లు నష్టం వచ్చింది. ఇస్తామన్న ఆర్థిక లోటు కేంద్రం భర్తీ చేయలేదు. రాష్ట్రానికి ఇస్తామన్న పరిశ్రమల హామీ నెరవేర్చలేదు. ఐదేళ్ల ఎన్డీఏ పాలనలో ఏపీకి ఇచ్చిందేమీ లేదు. ఐదేళ్ల నుంచి ఆంధ్ర ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
-శరద్‌ యాదవ్

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రధాని మోదీ మోసం చేశారు. అబద్ధాలు చెప్పడంలో మోదీ దిట్ట.
తిరుపతి వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చి అమలు పరచట్లేదు. చంద్రబాబు చేస్తున్న పోరాటానికి ఆప్‌ మద్దతు ఉంటుంది.
-అరవింద్‌ కేజ్రీవాల్‌


ధర్మపోరాట దీక్షకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. చంద్రబాబు వెంట మేము ఉంటాం. చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా ఎస్పీ పార్టీ ఆయన వెంట నడుస్తోంది. ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది.
-ములాయం సింగ్‌ యాదవ్‌


12గంటల పాటు చంద్రబాబు దీక్ష కొనసాగించగా... రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజానీకం.. చంద్రబాబుతోపాటు... దీక్షలో కూర్చున్నారు. రాత్రి 8గంటల సమయంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ చంద్రబాబుతో నిరసన విరమింపజేశారు.

Last Updated : Feb 11, 2019, 11:06 PM IST

ABOUT THE AUTHOR

...view details