ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 30, 2019, 12:49 PM IST

Updated : Jun 30, 2019, 2:04 PM IST

ETV Bharat / state

'అమరావతిని కూల్చేద్దాం.. హైదరాబాద్​ను అభివృద్ధి చేద్దాం'

తెదేపా ఎంపీ కేశినేని నాని.. ఫేస్​బుక్ వేదికగా మళ్లీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ప్రజావేదిక కూల్చివేత, నిలిచిన సింగపూర్ - విజయవాడ విమాన సేవలపై వినూత్న నిరసన తెలిపారు.

tdp mp kesineni nani

ముఖ్యమంత్రి జగన్ పరిపాలన తీరుపై.. తెదేపా లోక్​సభ సభ్యుడు కేశినేని నాని.. సామాజిక మాధ్యమాల్లో వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రజావేదికను కూలగొట్టిన నిర్ణయానికి తోడు.. చంద్రబాబు హయాంలో సింగపూర్ - విజయవాడ మధ్య రాకపోకలు చేసిన విమాన సేవలు.. తాజాగా జగన్ హయాంలో నిలిచిపోవడంపై.. ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సీఎం జగన్ సమావేశాల తీరును స్పృశిస్తూ.. ఫేస్​బుక్​లో సెటైరికల్ పోస్టు చేశారు. ఆ పోస్టుకు.. 'అమరావతిని కూల్చేద్దాం.. హైదరాబాద్​ను అభివృద్ధి చేద్దాం' అని కామెంట్​ను జత చేశారు.

ఫేస్​బుక్​లో తెదేపా ఎంపీ కేశినేని పోస్ట్
Last Updated : Jun 30, 2019, 2:04 PM IST

ABOUT THE AUTHOR

...view details