ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమావేశమైన తెలుగు రాష్ట్రాల ఎక్సైజ్ అధికారులు

కృష్ణా జిల్లాలో తెలుగురాష్ట్రాల ఎక్సైజ్ అధికారలు ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని కార్యచరణ రూపొందించారు.

By

Published : Mar 19, 2019, 12:21 AM IST

ఎక్సైజ్ అధికారుల సమావేశం

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని గరికపాడు బోర్డర్ రెస్టారెంట్​లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎక్సైజ్ అధికారులు ఉమ్మడి సమావేశం నిర్వహించారు. సరిహద్దులో గల 6 జిల్లాల ఉన్నతాధికారులు, 13 ఎక్సైజ్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అక్రమ మద్యం, నాటుసారా, చట్ట వ్యతిరేక కార్యకలపాలను అరికట్టేందుకు ఉమ్మడి కార్యాచరణ రూపొందించారు. సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతూ అక్రమాలకు అడ్డుకట్టవేయాలని సమావేశంలో నిర్ణయించారు.

ఎక్సైజ్ అధికారుల సమావేశం

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details