ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆశావాహుల ఆఖరి ప్రయత్నం!

సీఎం నివాసానికి పెద్దఎత్తున పెండింగ్‌ నియోజకవర్గాల ఆశావహులు చేరుకున్నారు. ఇప్పటికే 130 స్థానాలకు అభ్యర్ధుల జాబితా ఖరారైంది. మిగిలిన ఒక్కో స్థానం నుంచి అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నివాసానికి భారీగా తెదేపా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.

By

Published : Mar 12, 2019, 2:06 PM IST

ఆశావాహుల ఆఖరి ప్రయత్నం!

సీఎం నివాసానికి పెద్దఎత్తున పెండింగ్‌ నియోజకవర్గాల ఆశావహులు చేరుకున్నారు.ఇప్పటికే130స్థానాలకు అభ్యర్ధుల జాబితా ఖరారైంది.మిగిలిన ఒక్కో స్థానం నుంచి అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు.ఈ క్రమంలో చంద్రబాబు నివాసానికి భారీగా తెదేపా నాయకులు,కార్యకర్తలు తరలివచ్చారు.

పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గాల నాయకులను పార్టీ అధిష్ఠానం పిలిపించి మాట్లాడుతోంది.ఆయా నియోజకవర్గాల్లో నేతల అభిప్రాయాన్ని సమన్వయ కమిటీ సేకరిస్తోంది.ఆ తరువాత వివరాల నివేదికను పార్టీ అధినేతకు ఇవ్వనుంది.యనమల,సుజనా ఆధ్వర్యంలో2సమన్వయ కమిటీల ద్వారా అభిప్రాయాల సేకరణ జరుగుతోంది.ఒకట్రెండు రోజుల్లో పెండింగ్‌ జాబితా మొత్తం పూర్తవుతుందంటున్న పార్టీ వర్గాలు తెలిపాయి.

ABOUT THE AUTHOR

...view details