ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆందోళన వద్దు...చరిత్ర పునరావృతమవుతుంది : చంద్రబాబు

తెదేపాకు సంక్షోభాలు కొత్త కాదని అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపాకు కార్యకర్తలు, ప్రజలు అండగా నిలబడిన ప్రతి సారి తిరిగి పుంజుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఎంపీలు వారి స్వార్ధ ప్రయోజనాల కోసమే పార్టీని వీడి భాజపాలోకి చేరారన్నారు.

By

Published : Jun 21, 2019, 7:03 AM IST

ఆందోళన వద్దు...చరిత్ర పునరావృతమవుతుంది:చంద్రబాబు

పార్టీని వీడిన ఎంపీల గురించి, పార్టీని గురించి ప్రస్తావిస్తూ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే...
రాష్ట్ర ప్రయోజనాల కోసమే నాడు భాజపాను వీడామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్విట్టర్లో స్పష్టం చేశారు. ఆ రోజు భాజపా తో వీడకుండా కలిసి ఉంటే తెదేపా పరిస్థితి ఇప్పుడు చాలా మెరుగ్గా ఉండేదని ఆయన అన్నారు. అలా కలిసి ఉంటే రాష్ట్రాన్ని, కోట్లాది మంది ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టినట్లయ్యేదని, కానీ తాను ఆ పనిచేయలేదన్నారు. తన జీవితం మొత్తం ప్రజల ప్రయోజనాల కోసమే కష్టపడ్డానని, అధికారంలో ఉన్నామా లేదా అన్నది చూడలేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

సంక్షోభాలు కొత్త కాదు...పార్టీని వీడి భాజపాలోకి వెళ్లిన ఎంపీలకు వారి వ్యక్తిగత అజెండా లు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ఇలాంటి సంక్షోభాలు తనకు కొత్త కాదని గుర్తు చేశారు. గతంలోనూ తెలుగుదేశం చచ్చిపోయింది అన్నారని, పూడ్చి పెట్టేశాము అని ఇతరులు ప్రగల్భాలు పలికిన పరిణామాలను ఆయన ప్రస్తావించారు. తెదేపా ఏనాడు చేతులెత్తేయలేదని...ప్రతీ సారి తిరిగి పుంజుకున్నామన్నారు.
కార్యకర్తలు, ప్రజలే తెదేపాకు అండ....తెలుగుదేశం పార్టీకీ లక్షలాది కార్యకర్తలు, కోట్లాది తెలుగు ప్రజల అండ ఉందన్న చంద్రబాబు.. చరిత్ర మళ్లీ పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి ఆందోళన లేదని తేల్చి చెప్పారు.
పసుపు సైనికుల్లా మీ వెంటే ఉంటాం...చంద్రబాబు ట్వీట్ కు ప్రతి స్పందనగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ సైతం ట్వీట్ చేశారు. నిబద్ధత కలిగిన పసుపు సైనికుల్లా...అధినేత చంద్రబాబు వెంటే ఉండి పోరాడతామని స్పష్టం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details