ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామీణ బ్యాంకు రంగంలో మొదటిస్థానమే లక్ష్యం!

గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉండి... అవసరమైన రుణాలు అందిస్తున్న ఏపీజీవీబీ మొదటి స్థానాన్ని చేరుకోవటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్​ తెలిపారు.

By

Published : May 9, 2019, 6:03 PM IST

ఏపీజీవీబీ ఛైర్మన్

గ్రామీణ బ్యాంకు రంగంలో మొదటిస్థానమే లక్ష్యం

దేశంలోని అన్ని గ్రామీణ బ్యాంకుల్లోకెల్లా అత్యధికంగా వ్యాపార లావాదేవీలు నిర్వహించి... వచ్చే ఆర్థిక ఏడాది ముగింపు నాటికి మొదటి స్థానానికి చేరుకోవటమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస బ్యాంకు ఛైర్మన్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను హైదరాబాద్​లో వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన తమ బ్యాంకు గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నామని వివరించారు. ఏపీజీవీబీ వ్యాపార లావాదేవీలు రికార్డు స్థాయిలో 30వేల కోట్లకు మించిందన్న ప్రవీణ్​కుమార్​ 2017-18 ఆర్థిక ఏడాది ముగింపులో రూ.28,650 కోట్ల నుంచి రూ.32,714 కోట్లకు పెరిగి 14.19 శాతం వృద్ధి నమోదు చేసుకున్నట్లు తెలిపారు. డిపాజిట్లపై 12.02 శాతం, అడ్వాన్సుల్లో 16.36 శాతం వృద్ధి నమోదైనట్లు వివరించారు. బ్యాంకు అవుట్‌ స్టాండింగ్‌ మొత్తంలో 59 శాతం అంటే రూ.1883 కోట్లు గృహ రుణాలు ఇచ్చినట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details