ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 16, 2022, 12:42 PM IST

ETV Bharat / state

College bus accident : ఇంజినీరింగ్‌ కళాశాల బస్సు, లారీ ఢీ, ఏడుగురు విద్యార్థులకు గాయాలు

College bus : బాపట్లస జిల్లా సంతమాగులూరులో రోడ్డుప్రమాదం జరిగింది. నరసరావుపేట ఎన్ఈసీ కళాశాలకు చెందిన బస్సు ఎదురుగా వచ్చిన లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు.

College bus lorry accident
నరసరావుపేట ఇంజినీరింగ్‌ కళాశాల

Bus lorry accident : బాపట్ల జిల్లా సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద కళాశాల విద్యార్థుల బస్సు ఎదురుగా వచ్చిన లారీని ఢీకొంది. ఈఘటనలో ఏడుగురు విద్యార్థులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. నరసరావుపేటకు చెందిన ఇంజినీరింగ్‌ కళాశాల బస్సు.. 30 మంది విద్యార్థులతో వినుకొండ నుంచి కళాశాలకు వెళ్తోంది. సంతమాగులరు క్రాస్​ రోడ్డు వద్దకు రాగానే.. ఎదురుగావచ్చిన లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు.

నరసరావుపేట ఇంజినీరింగ్‌ కళాశాల

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details