ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 20, 2020, 12:18 PM IST

ETV Bharat / state

భార్య పుట్టింటికి వెళ్లిందని.. భర్త ఆత్మహత్య

భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

young man suicide
ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య

అనంతపురం జిల్లా కంబదూరు మండలం వైసీ పల్లి గ్రామంలో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. మనోహర్ అనే యువకుడికి 6 నెలల క్రితమే వివాహమైంది.

ఇంట్లో సమస్యల వల్ల భార్య పుట్టింటికి వెళ్లిందని.. ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని కంబదూరు ఎస్ఐ గౌస్ పీరా తెలిపారు. మనోహర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించామన్నాకు. కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details