ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 18, 2021, 9:33 AM IST

Updated : Nov 18, 2021, 4:39 PM IST

ETV Bharat / state

WOMAN MURDER: వివాహిత దారుణ హత్య...భర్తే హంతకుడా!

అనంతపురం జిల్లా కదిరి మండలం పట్నంలో వివాహిత దారుణ హత్యకు గురైంది. అనుమానంతో భర్తే కర్రతో కొట్టడంతో మృతి చెందినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

వివాహిత దారుణ హత్య
వివాహిత దారుణ హత్య

అనంతపురం జిల్లా కదిరి మండలం పట్నంలో వివాహిత దారుణ హత్యకు గురైంది. పట్నం గ్రామానికి చెందిన హేమలత.. అదే గ్రామానికి చెందిన రామాంజనేయులుతో వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానంతో భర్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వీరిరువురూ కలిసి ఉండటాన్ని.. హేమలత భర్త శివశంకర్ రెడ్డి చూసినట్లు స్థానికులంటున్నారు. దీంతో శివశంకర్ తీవ్ర ఆగ్రహంతో ఇద్దరిపై రోకలి బండతో దాడి చేశారంటున్నారు. ఈ ఘటనలో హేమలత తలకు రోకలిబండ బలంగా తగిలి.. తీవ్ర గాయాలపాలైంది. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని శివశంకర్ పోలీసులకు సమాచారం ఇచ్చి లొంగిపోయాడు.

Last Updated : Nov 18, 2021, 4:39 PM IST

ABOUT THE AUTHOR

...view details