ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎస్ఈసీ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: తెదేపా

By

Published : Mar 2, 2021, 6:03 PM IST

ఎస్​ఈసీ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధి తెదేపా శ్రేణులు డిమాండ్ చేశారు. వాలంటీర్లు..ఓటరు స్లిప్పులను పంపిణీచేస్తూ..అధికార పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

Volunteers in  election campaign
అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధి

అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో వాలంటీర్లు..ఓటరు స్లిప్పులను పంపిణీచేస్తూ..అధికార పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారని స్థానిక తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. పట్టణంలోని సైదాపురంలోని మూడో వార్డులో వైకాపా అభ్యర్థి తరఫున వాలంటీర్లు స్లిప్పులు పంపిణీ చేశారు. తెదేపా నాయకులు అక్కడికి చేరుకుని వాలంటీర్లను అడ్డుకున్నారు. వారిని చూసిన వాలంటీర్లు అక్కడి నుంచి జారుకున్నారు. ఎస్ఈసీ నిబంధనలు పాటించకుండా స్లిప్పులు పంపిణీ చేయిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని తెదేపా శ్రేణులు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details