సామాజిక ఆరోగ్య కేంద్రంలో విధుల్లో చేరడానికి వెళ్తున్న వైద్యురాలిని.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి కుటుంబంతో పాటు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వద్ద ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. అదే వాహనం.. మోటర్ సైకిల్పై వస్తోన్న తూర్పు కోడిపల్లి గ్రామానికి చెందిన బోయ అంజి, ఆంజనేయులనూ బలి తీసుకున్నట్లు గుర్తించారు. బాధితులు ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు మృతి, పలువురికి గాయాలు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రధాన రహదారి రక్తమోడింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో రెండు ద్విచక్రవాహనదారులు, కారు ప్రయాణికులు గాయాలపాలయ్యారని పోలీసులు తెలిపారు.
కళ్యాణదుర్గం వద్ద రోడ్డు ప్రమాదం
ఈ ప్రమాదానికి కారణమైన వాహనమే.. మరో రెండు మోటర్ సైకిళ్లను, కార్లను ఢీకొట్టినట్లు గ్రామస్థులు తెలిపారు. వారు కొద్దిపాటి గాయాలతో బయటపడినట్లు వెల్లడించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి:కనిపించకుండా పోయిన చిరు వ్యాపారి.. మృతదేహమై తేలాడు!