ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కన్నతండ్రిని గొడ్డలితో నరికి చంపిన తనయుడు

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో తల్లిని వేధిస్తున్నాడని ఓ తండ్రిని కన్న కొడుకు నరికి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

By

Published : Dec 9, 2019, 7:16 PM IST

The brutal son who killed the virgin daughter
వై.టి చెరువులో కన్నతండ్రిని గొడ్డలితో చంపిన కిరాతక కొడుకు

కన్నతండ్రినే నరికి చంపిన కుమారుడు

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం వై.టి చెరువులో దారుణం జరిగింది. రోజూ మద్యం తాగి వచ్చి తల్లిని వేధిస్తున్నాడని ఓ కుమారుడు కన్న తండ్రినే గొడ్డలితో నరికి చంపాడు. గ్రామానికి చెందిన లాలెప్ప రోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. మూడు రోజుల క్రితం ఆమెను ఇంట్లో నుంచి గెంటేశాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కొడుకు నాగరాజు తండ్రిని మందలించాడు. దీనిపై ఆగ్రహించిన లాలప్ప మద్యం తాగి వచ్చి కొడుకును దుర్భాషలాడుతూ గొడవపడ్డాడు. వివాదం తారాస్థాయికి చేరడ వల్ల నాగరాజు విచక్షణ కోల్పోయి తండ్రిపై గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని తండ్రి మృత దేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details