అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఆలూరు గ్రామంలో ఈ నెల 13న జరిగిన తెదేపా, వైకాపా నాయకుల మధ్య ఘర్షణ కేసులో ఇరువర్గాలకు చెందిన 21 మందిపై కేసులు నమోదు చేసి 19 మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వీఎన్కే చైతన్య తెలిపారు. వారిని రిమాండ్కు తరలించామన్నారు. తెదేపాకు చెందిన తిరుపాల్ రెడ్డితో పాటూ మరో 12 మందిపై, వైకాపాకు చెందిన రాజగోపాల్ రెడ్డితో పాటూ మరో 8 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. వీరిలో వైకాపాకు చెందిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వివరించారు.
ఘర్షణ కేసులో తెదేపా, వైకాపా నాయకుల అరెస్ట్
పంచాయతీ ఎన్నికల్లో తెదేపా-వైకాపా శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి పోలీసులు 21 మందిపై కేసు నమోదు చేశారు. వారిలో 19 మందిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ చైతన్య చెప్పారు.
ఘర్షణ కేసులో తెదేపా, వైకాపా నాయకుల అరెస్ట్